AP Govt Employees : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్ జీవో విడుదల

AP Govt Employees : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్ జీవో విడుదల

AP Govt Employees Updates :

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో విడుదల చేయడం జరిగింది..180 రోజుల ప్రసూతి సెలవులు ఇంతకు ముందు కేవలం ఇద్దరు పిల్లలు వరకు మాత్రమే ఇచ్చేవారు ఇక నుండి ఎంతమంది పిల్లలు పుట్టిన ప్రసూతి సెలవులు 180 రోజులు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరిస్తూ జీవో నెంబర్ 21 ను జారీ చేయడం జరిగింది.

Maternity Leave For AP Govt Women Employees :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తల్లి కి వందనం పథకం లో ఎంతమంది పిల్లలు ఉన్నా వర్తిస్తుందని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే అలాగే ఎన్నికల్లో ఎంతమంది పిల్లలు ఉన్నా పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తూ జీవో జారీ చేసారు. ప్రస్తుతం మహిళ ఉద్యోగులకు ప్రసూతి సెలవుల్లో అవకాశం కల్పించారు. ఇందులో భాగం గా 180 రోజులు ప్రసూతి సెలవులు ఇక నుండి ఎంతమంది పిల్లలు ఉన్నా తీసుకునే అవకాశం ఉంటుంది.

రాష్ట్రంలో యువతీ మరియు దేశంలో యువ జనాభా తగ్గిపోతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి మంచి అవకాశాన్ని కల్పిస్తున్నారు. మహిళా ఉద్యోగులకు ఇది ఒక మంచి శుభ పరిణామం మహిళలకు ఇచ్చినట్టే మగ వారికీ కూడా పాటర్నిటీ సెలవు ఇస్తారని త్వరలోనే వాటికీ సంబందించిన జీవో కూడా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *