AP ఎంసెట్ 2025, ఇంటర్ పరీక్షల్లో అర్హత పొందినవారు – July 6th లోగా Website లో ఇవి Submit చెయ్యాలి : వాటి వివరాలు వెంటనే చూడండి

AP EAMCET 2025:

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

2025 లో ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ పరీక్షల్లో మరియు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అర్హత పొందినటువంటి వారు, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 వెబ్ సైట్ లో జులై 6వ తేదీలోగా డిక్లరేషన్ ఫారం పూర్తి చేసి మళ్లీ సబ్మిట్ చేయాలని, ఏపీ ఎంసెట్ కన్వీనర్ తెలిపారు. దీనికి సంబంధించి అధికారిక వెబ్సైట్లో కొత్త అప్డేట్ కింద అది స్క్రోలింగ్ కూడా అవుతుంది. కాబట్టి ఇంటర్మీడియట్ అలాగే ఏపీ ఎంసెట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైనటువంటి వారు కచ్చితంగా గడువులోగా మీ యొక్క వివరాలను పూర్తి చేసి డిక్లరేషన్ ఫారం సబ్మిట్ చేయవలెను. దీనికి సంబంధించి వచ్చినటువంటి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.

డిక్లరేషన్ ఫారం ఎలా పూర్తి చేయాలి?: వాటి వివరాలు :

ఏపీ ఎంసెట్ వెబ్సైట్లోని డిక్లరేషన్ ఫారం ఈ క్రింది విధంగా చేయండి

1. ముందుగా ఏపీ ఎంసెట్ వెబ్సైట్ https://cets.apsche.ap.gov.in/EAPCET ఓపెన్ చేయండి
2. వెబ్సైట్ హోం పేజ్ లో ” declaration form” ఆప్షన్ పై క్లిక్ చేయండి
3. విద్యార్థుల యొక్క ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి
4. మీ యొక్క డిక్లరేషన్ ఫారం ఓపెన్ అవుతుంది. ఆ ఫారం లో ఉన్న పూర్తి వివరాలు మళ్లీ ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి.
5. ఇది తప్పనిసరిగా చేయవలసినటువంటి పని.
6. ఫారం సబ్మిట్ చేసే ముందు అన్ని వివరాలు మరొకసారి చూసుకొని సబ్మిట్ చేయవలెను.

డిక్లరేషన్ ఫారం ఏ విధంగా పూర్తి చేయాలి? సబ్మిట్ చేయడానికి ఆఖరి తేదీ:

ఏపీ ఎంసెట్ అధికారికి వెబ్సైట్ లో డిక్లరేషన్ ఫారం లోని అన్ని వివరాలు పూర్తి చేసే సబ్మిట్ చేయడానికి జులై 6వ తేదీని ఆఖరి తేదీగా అధికారులు తెలిపారు. కావున విద్యార్థులందరూ కూడా గడువులోగా డిక్లరేషన్ ఫారం లో మార్పులు, చేర్పులు అన్నీ చేసుకుని ఎటువంటి తప్పులు లేకుండా ఫారం పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.

AP ఎంసెట్ వెబ్ సైట్ లో డిక్లరేషన్ ఫారం ఎలా సబ్మిట్ చేయాలి ? ఎవరు సబ్మిట్ చేయాలి?:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ వెబ్సైట్ లో డిక్లరేషన్ ఫారం ని ఈ క్రింది విధంగా విద్యార్థులు తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది

1. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025లో ఉత్తీర్ణులైన వారు. అనగా అర్హత పొందిన వారు
2. అలాగే, 2025 లో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి అందులో అర్హత పొందినటువంటి వారు డిక్లరేషన్ ఫారం ని పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.

సమర్పించాల్సిన గడువు తేదీ :

జూలై 6, 2025 సాయంత్రం 5 గంటల లోపు. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

పైన తెలిపిన ప్రాసెస్ ద్వారా డిక్లరేషన్ ఫారం ని ఏపీ ఎంసెట్ మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు అర్హత పొందిన ప్రతి విద్యార్థి వెంటనే సబ్మిట్ చేసుకోగలరు.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply