
Thalliki Vandanam Update:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తల్లికి వందనం (Talliki Vandanam) కార్యక్రమం ద్వారా విద్యార్థుల తల్లులకు సంవత్సరానికి రూ.15,000 నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ స్కీమ్ ద్వారా విద్యార్థుల చదువుకు ఆర్థికంగా సహాయపడటమే ప్రభుత్వముఖ్య లక్ష్యం.
తల్లికి వందనం పథకం కోసం ఎదురుచూస్తున్న వారికీ శుభవార్త . ప్రభుత్వం ప్రతి సంవత్సరం సంక్షేమ క్యాలెండరు విడుదల చేయాలనీ పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు. దానికి అనుగుణంగా తల్లి కి వందనము పథకాన్ని జూన్ 12 వ తేదీ పాఠశాలలు తెరిచే రోజు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పథకం లో భాగంగా ప్రతి తల్లి కి ఎంత మంది పిల్లలు ఉంటే అన్ని 15 వేల రూపాయలు వారి అకౌంట్ కి నేరుగా లబ్ది చేకూరే అవకాశం కల్పించారు.
Thalliki Vandanam Release Date :
గత ప్రభుత్వం లో జగనన్న అమ్మ వడి అనే పథకాన్ని మార్చి తల్లికి వందనం అని ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. కానీ వాటికీ సంబంధించి డబ్బులు ఎపుడు పడతాయని చాల రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి 15,000 ఇస్తారని ప్రకటించారు. ఈ పథకాన్ని ఆఫీషియల్ గా జూన్ 12 వ తేదీ ప్రారంభించనున్నారు. ఆ రోజున పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లితండ్రులకు అర్హతలు అనుసరించి అర్హులు ఉంటే ఈ పథకం లబ్ది ఉంటుంది.
అవసరమైన డాక్యుమెంట్లు:
- విద్యార్థి ఆధార్
- తల్లి ఆధార్
- బ్యాంక్ ఖాతా వివరాలు
- పాఠశాల అటెండెన్స్ సర్టిఫికేట్
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
డబ్బు వచ్చిందా ఎలా తెలుసుకోవాలి?
మీ బ్యాంక్ ఖాతా SMS లేదా grama sachivalayam ద్వారా ఈ వివరాలను తెలుసుకోవచ్చు. లేదా https://navasakam.ap.gov.in/ వెబ్సైట్లో మీరు లబ్ధిదారుల జాబితా చూడవచ్చు.